జాతీయ స్థాయి చెస్‌ టోర్నీలో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి చెస్‌ టోర్నీలో ప్రతిభ

Jun 23 2026 1:40 AM | Updated on Jun 23 2026 1:40 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : బెంగళూరులోని మార్తహళ్లి, లేక్‌ వ్యూ పబ్లిక్‌ స్కూల్‌లో ఈ నెల 21న నిర్వహించిన రెండో చెస్‌ టైటాన్స్‌ ఓపెన్‌ ఏజ్‌ కేటగిరీ టోర్నమెంట్‌ జాతీయ స్థాయి చెస్‌ పోటీల్లో కడపకు చెందిన క్రీడాకారిణులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించినట్లు అనీష్‌ దర్బారి చెస్‌ అకాడమీ చీప్‌ కోచ్‌ అనీష్‌ దర్బారి తెలిపారు.అండర్‌–16 బాలికల విభాగంలో గోరంట్ల తేజోమయి 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానం, అండర్‌–12 బాలికల విభాగంలో గంట లక్ష్మీ మానస్రీ 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి 5వ స్థానం పొందినట్లు చెప్పారు. నిర్వాహకులు వీరికి ట్రోఫీ, ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా నుంచి పాల్గొన్న ఇతర క్రీడాకారులు కూడా మంచి ఆటతీరును ప్రదర్శించారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement