గత ప్రభుత్వం రాజోలి ఆనకట్ట నిర్మాణం చేపడుతుందని ప్రకటిస్తే నమ్మి మా భూములు ఇచ్చాం. మా గ్రామంలో 1 నుంచి 60 సర్వే నంబర్ల వరకు భూములు తీసుకున్నారు. ఆ తర్వాత రైతులు ఎక్కువ పరిహారం కావాలని అడిగారు. అది పక్కన పెడితే, ప్రతి ఏటా కుందూ నదిలో సోమశిల ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల నీరు పారాల్సి ఉండగా, ఇప్పుడు ఏకంగా 24 వేల క్యూసెక్కుల నీరు పంపిస్తున్నారు. దీనివల్ల మా భూములన్నీ నీట మునిగి, వ్యవసాయానికి పనికిరాకుండా నాశనమైపోతున్నాయి. మా ఇబ్బందులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు.
– కృష్ణారెడ్డి, రైతు, చిన్నముడియం
(పెద్దముడియం మండలం)


