
ప్రజలు మార్పు కోరారు. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే అయ్యారు.
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాతీర్పును ప్రజాస్వామ్యవాదులు గౌరవించాలి. హోదా, స్థాయికి అనుగుణంగా హుందాగా నడుచుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులకు నిత్యం తపన ఉండాలి. అవకాశం ఉన్నంతలో అభివృద్ధి కోసం విశేషంగా పాటు పడాలి. ఉన్నతమైన ప్రజాప్రతినిధుల్లో అలాంటి వైఖరి కన్పించనడ సహజం. కడపలో తబ్భిన్నమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. లేని ప్రొటోకాల్ కోసం మంకు పట్టు పడుతున్నారు. మేయర్ స్థానానికి దీటుగా తనకు కుర్చీ ఉండాలంటూ భీిష్మించుకున్నారు. అందుకోసం ఎందాకై నా సరే, అంటూ ఏకంగా అనర్హత వేటు దిశగా అడుగులు వేశారు. కుర్చీ కోసం పంతం పట్టిన కడప రెడ్డెమ్మలో అడుగడుగునా నియంతృత్వం తెరపైకి వచ్చింది. అందుకు ఏకపక్షంగా వ్యవహరించే అధికారులు తోడయ్యారు. అధికారుల తప్పిదాన్ని మేయర్ సురేష్బాబుకు రుద్దారు. అంతే స్పీడుగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష ఉత్తర్వులు వెల్లడించింది. ఈమొత్తం వ్యవహారాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అయినప్పటికీ కార్పొరేషన్ కేంద్రంగా చోటుచేసుకున్న వ్యవహారంలో ఎలాంటి మార్పు లేదు. శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించుకోగా, ఇప్పటికీ సమావేశం మందిరం తెరిచేందుకు కమిషనర్ మనోజ్రెడ్డి మనస్సు ఒప్పుకోవడం లేదు. మేయర్ సురేష్బాబు స్వయంగా కోరినా చలనం లేదు. అందుకు కారణం అనధికారికంగా ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేలకు మేయర్ స్థానంలోనే సీట్లు ఏర్పాటు చేయడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
కొనసాగుతున్న వేధింపులు
కార్పొరేషన్ కేంద్రంగా కమిషనర్ మనోజ్రెడ్డిని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే మాధవీరెడ్డి వేధింపులు కొనసాగిస్తున్నారని పలువురు వెల్లడిస్తున్నారు. మేయర్ కోరినప్పటికీ సమావేశం మందిరాన్ని కూడా తెరవకుండా కమిషనర్ డొంకతిరుగుడు ధోరణితో వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న ధోరణి నేపథ్యంలో కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశం నిర్వహణకు కూడా కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితిని నెలకొంది. సవ్యంగా సమావేశం కొనసాగించాలని, ప్రజాసమస్యలపై చర్చించాలని, అఽభివృద్ధి పనులపై తీర్మానాలు చేయాలనే ఆలోచన అటు అధికారులకు, ఇటు అధికార పార్టీ నేతలకు లేకుండా పోయిందని పలువురు వివరిస్తున్నారు. ఇప్పటికై నా హుందాగా వ్యవహారించి సవ్యంగా సర్వసభ్య సమావేశాన్ని కొనసాగించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.
కుర్చీ చుట్టూనే వ్యవహారం....
కడప నగర పాలకమండలికి మేయర్ సుప్రీం. మేయర్ సీటు పైనుంటే ఎదురుగా కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు) వారికి కేటాయించిన స్థానాల్లో ఆశీనులు కావాల్సి ఉంది. అలా కాదు, అధికారంలో ఉన్నాం, మేయర్ సరసన నాకు సీటు ఉండాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టడం అవివేకం. పైన కూర్చుంటే హోదా పెరగదు, ఎక్స్ అఫి షియో సభ్యులకు కేటాయించిన సీటులో కూర్చుంటే తరగదు. ఈ సత్యాన్ని విస్మరించి, ఇప్పటికీ రెండు పర్యాయాలు సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవీరెడ్డి అడ్డు తగిలారు. మందీ మార్భలంతో కార్పొరేషన్ కార్యాలయంలోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. అధికారం అండతో సమావేశాన్ని అడ్డుతగులుదామనే ఆలోచన కంటే, ప్రజాసమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుందామనే స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇలాంటి చరిత్ర ఎప్పుడూ తెరపైకి రాలేదు. విచక్షణ మరిచి హుందాతనం కోల్పోతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటు కోసం విశ్వయత్నం
అధికార దుర్వినియోగానికి చెంపపెట్టుగా నిలుస్తున్న హైకోర్టు తీర్పు
సర్వ సభ్య సమావేశాం నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్న వైనం
కమిషనర్ మనోజ్రెడ్డి ద్వారా అనేక కుయుక్తులు

ప్రజలు మార్పు కోరారు. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే అయ్యారు.

ప్రజలు మార్పు కోరారు. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే అయ్యారు.

ప్రజలు మార్పు కోరారు. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే అయ్యారు.

ప్రజలు మార్పు కోరారు. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే అయ్యారు.