
సైనికుల్లా పని చేయాలి
రాబోయే నాలుగేళ్లు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలి. ప్రతి నెలా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించాలి. మూడు నెలలకోసారి జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవాలి. కార్యకర్తలు, నాయకులే పార్టీకి పట్టుగొమ్మలు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం, బలోపేతంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. 2019–24లో కార్యకర్తల అంచనాలకు అందుకోలేకపోయాం. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ 2.0 సరికొత్తగా, అద్భుతంగా ఉంటుంది. అన్ని కమిటీలు పార్టీకి పునాది లాంటివి. – పి. రవీంద్రనాథ్రెడ్డి,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ