వన్డే క్రికెట్‌ టోర్నీలో కడప, చిత్తూరు జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

వన్డే క్రికెట్‌ టోర్నీలో కడప, చిత్తూరు జట్ల విజయం

Jun 17 2025 5:38 AM | Updated on Jun 17 2025 5:38 AM

వన్డే

వన్డే క్రికెట్‌ టోర్నీలో కడప, చిత్తూరు జట్ల విజయం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్‌ జోన్‌ అండర్‌ –19 వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో కడప, చిత్తూరు జట్లు విజయం సాధించాయి. సోమవారం కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలు జట్టుపై 4 వికెట్ల తేడాతో చిత్తూరు జట్టు విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 21.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు చేసింది. చిత్తూరు జట్టులో ధనుష్‌ రెడ్డి అద్భుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్లు , సాయి శరణ్‌ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 82 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాంటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. జట్టులోని వరుణ్‌ 50 పరుగులు చేశాడు.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో..

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన వేరొక మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై 10 వికెట్ల తేడాతో కడప జట్టు విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 43.4 ఓవర్లకు అన్ని వికెట్లు కోల్పోయి130 పరుగులు చేసింది. జట్టులోని వీరారెడ్డి 25 పరుగులు చేశాడు. కడప బౌలర్‌ నాగ కుళ్లాయప్ప 3 వికెట్లు తీశాడు. అనంతరం 131 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన కడప జట్టు 15.1 ఓవర్లలో ఒక వికెట్‌ కూడా కోల్పోకుండా 132 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని రోహిత్‌ వర్మ 90 పరుగులు చేశాడు.

వన్డే క్రికెట్‌ టోర్నీలో కడప, చిత్తూరు జట్ల విజయం1
1/2

వన్డే క్రికెట్‌ టోర్నీలో కడప, చిత్తూరు జట్ల విజయం

వన్డే క్రికెట్‌ టోర్నీలో కడప, చిత్తూరు జట్ల విజయం2
2/2

వన్డే క్రికెట్‌ టోర్నీలో కడప, చిత్తూరు జట్ల విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement