
బాబోయ్.. ఇదేం తల్లికి వందనం
కూటమి ప్రభుత్వం ఎన్నో కొర్రీల తర్వాత అమలు చేసిన తల్లికి వందనం పథకాన్ని.. అందుకోవడానికి ప్రజలు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. కొందరి తల్లుల బ్యాంక్ ఖాతాలకు కాకుండా.. ఆధార్కు అనుసంధానం అయిన పోస్టల్ ఖాతాలకు నగదు జమ అయింది. డ్రా చేసుకునేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కడపలోని పోస్టల్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ప్రజలు బారులు తీరి కనిపించారు. ఉదయం 7 గంటల నుంచే దాదాపు కిలోమీటరు మేర బారులు తీరారు. చిన్న పిల్లలను తీసుకొచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తాగునీరు, భోజనం లేక ఆకలితో అలమటించారు. కార్యాలయం నుంచి ప్రధాన రహదారి పైకి క్యూ ఉండటంతో.. తోపులాట జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పోస్టల్ అధికారులు ప్రజల క్యూకు తగ్గటుగా కౌంటర్లను ఏర్పాటు చేయకుండా.. ఉన్న రెండు కౌంటర్లతోనే కార్యకలాపాలు సాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – కడప వైఎస్ఆర్ సర్కిల్

బాబోయ్.. ఇదేం తల్లికి వందనం

బాబోయ్.. ఇదేం తల్లికి వందనం