
●ఫ్లైయాష్ కోసం యుద్ధభేరీ
ఫ్లైయాష్ను సిమెంటు పరిశ్రమలకు తామే తరలించాలని కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మధ్య భీకర యుద్ధమే చోటుచేసుకుంది. పోలీసుల ప్రొటెక్షన్ ఏర్పాటు చేయించి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్రెడ్డి వాహనాలకు ఫ్లైయాష్ కేటాయించకుండా.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రైవేటుగా తన మనుషులను పెట్టి అడ్డకున్న ఈ వ్యవహారం పాఠకులకు తెలిసిందే. సీఎంఓ స్థాయిలో జోక్యం చేసుకొని ఎంఓయూ మేరకు ఆయా ట్రేడర్స్కు ఫ్లైయాష్ కేటాయించేలా ఆదేశించారు. కాగా, ఫ్లైయాష్ ఫాండ్కు చేరకుండానే మధ్యలో ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా కొల్లగొట్టుతున్న చరిత్ర తాజాగా ఆర్టీపీపీలో ఉత్పన్నం కావడం గమనార్హం. ఈ విషయమై పలువురు జెన్కో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నిష్ప్రయోజనమే అయ్యిందని పలువురు వివరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప: కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆధారంగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాను తలదన్నేలా.. ఆర్టీపీపీలో అక్రమ దందా తెరపైకి వస్తోంది. నాడు (2014–19) పోట్లదుర్తి బ్రదర్స్ హవా కొనసాగిస్తే.. తాజాగా దేవగుడి సోదరుల హవా నడుస్తోంది. గతంలో ఆర్టీపీపీ 600 ఎండబ్ల్యూ(మెగావాట్లు) ప్లాంట్ నిర్మాణం పేరుతో అక్రమ కార్యకలాపాలు నడిపేవారు. ఇప్పుడు కూడా 600 ఎండబ్ల్యూ గేట్ నుంచి అనధికారికంగా బల్కర్స్ ఇన్ అవుట్ అవుతున్నాయి. ఈఎస్పీ ఆఫర్స్ నుంచి ఫ్లైయాష్ దోపిడీ దందా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు తక్కువంటే రూ.2 లక్షలు జెన్కో ఆదాయం కోల్పోతుండగా, ఆ మొత్తం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుతోంది.
ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా దోపిడీ
డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆధారంగా అక్రమార్జన కోసం కూటమి ప్రభుత్వ నేతలు అర్రులు చాస్తున్నారు. నాడు నిర్మాణ పనుల ఆధారంగా అధికార పార్టీ నేతలు ఆదాయం ఆశిస్తే.. నేడు ఆర్టీపీపీ నుంచి వెలువడే ఫ్లైయాష్ ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజు ఆర్టీపీపీ రన్నింగ్ యూనిట్ల నుంచి ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా సైనోస్ నుంచి ఫ్లైయాష్ రిలీజ్ చేస్తారు. కాగా, సైనోస్లో ప్రాబ్లమ్స్ తలెత్తితే, ఈఎస్పీ ఆఫర్స్ ఓపెన్ చేసి ఫ్లైయాష్ రిలీజ్ చేస్తారు. ఈఎస్పీ ద్వారా రిలీజ్ అయిన గ్రౌండ్ ఫ్లైయాష్ క్లియర్ చేసేందుకు టన్నుకు రూ.60 చొప్పున ఆర్టీపీపీ చెల్లిస్తోంది. అక్కడ నుంచి సదరు కాంట్రాక్టర్ ఫ్లైయాష్ క్లియర్ చేయాలి. అయితే సైనోస్ ద్వారా డైలీ 2 వేల టన్నులు ఫ్లైయాష్ రిలీజ్ అవుతోంది. ఎంఓయూ మేరకు టన్ను రూ.546తో నేరుగా ట్రక్కు లు, ట్యాంకర్ల ద్వారా బల్కర్స్ వే బ్రిడ్జి దగ్గరకు వెళ్లి పేమేంట్ చేసేవారు. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని అధికార పార్టీ నేతలు పూర్తిగా మరుగు పర్చారు. ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా ఫ్లైయాష్ దోపిడీ చేస్తున్నారు.
అధికారుల సహకారంతో జెన్కో ఖజానాకు చిల్లు
ఫ్లైయాష్తో నింపిన ట్యాంకర్లు వేబ్రిడ్జి కాటా వేసిన తర్వాత ఇన్వాయిస్, జీఎస్టీ బిల్లు జనరేట్ చేయా ల్సి ఉంది. టన్ను రూ.546తో ట్రేడర్స్కు బిల్లు చేయా ల్సి ఉంది. కాగా ప్రతి రోజు ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా ఫ్లైయాష్ను రిలీజ్ చేస్తున్నారు. ఆ ఫ్లైయాష్ నేరుగా ఓ ట్యాంకర్లో పడేలా ఫిక్స్ చేశారు. సదరు ట్యాంకర్కు కంప్రెషర్ ద్వారా ఎయిర్ పైపు ఫిట్ చేసి దాని ద్వారా బల్కర్లకు లోడ్ చేస్తున్నారు. మరోవైపు బల్కర్లు అధికంగా వస్తే నేరుగా ఈఎస్ఫీ ఆఫర్స్కు మిషన్ ఫిట్ చేసి లోడింగ్ చేస్తున్నారు. ఇదంతా అనధికారికంగా నడుస్తోంది. కేజీఎఫ్ సినిమాలో లాగా ఫ్లైయాష్ను కొల్లగొట్టుతున్నారు. ప్రతి రోజు ఇలా 4 నుంచి 6 ట్యాంకర్లు అక్రమంగా తరలుతున్నాయి. ఒక్కొక్క ట్యాంకర్కు 50 నుంచి 70 టన్నులు లోడింగ్ చేస్తున్నారు. సరాసరిగా ఒక్కొక్క ట్యాంకర్ ద్వారా రూ.35 వేల అక్రమార్జన లభిస్తోంది. ఈ ట్యాంకర్లన్నీ 600 మెగావాట్స్ గేటు నుంచి ఇన్ అవుట్ అవుతోన్నాయి. వీటికి వేబిల్స్ ఉండవు, జీఎస్టీ బిల్లులు ఉండవు. ప్రైవేటు వేబ్రిడ్జి వద్ద కాటా వేయించుకొని సిమెంటు పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. కాటా ఆధారంగా సిమెంటు కంపెనీలు బిల్లులు జనరేట్ చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం జెన్కో అధికారుల సహకారంతోనే అధికార పార్టీ నేతలు తరలిస్తోన్నట్లు సమాచారం. ప్రతి రోజు దాదాపు రూ.2 లక్షలు తెలిసి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుంటే ‘కళ్లుండీ చూడలేని కబోదిలా’ వ్యవహరిస్తున్నారు.
నాడు పోట్లదుర్తి బ్రదర్స్.. నేడు దేవగుడి సోదరుల దందా
ఫ్లైయాష్ అక్రమ రవాణాలో ఆరితేరిన కూటమి నేతలు
యాష్ ఫాండ్కు తరలించకుండానే అక్రమ రవాణా
దోపిడీకి సరికొత్త ఎత్తుగడ.. నిత్యం లక్షలాది రూపాయలు స్వాహా
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జెన్కో యంత్రాంగం

●ఫ్లైయాష్ కోసం యుద్ధభేరీ

●ఫ్లైయాష్ కోసం యుద్ధభేరీ

●ఫ్లైయాష్ కోసం యుద్ధభేరీ

●ఫ్లైయాష్ కోసం యుద్ధభేరీ