
డయల్ 112 సేవలను సద్వినియోగం చేసుకోండి
ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్
కడప అర్బన్: జిల్లాలోని ప్రజలు పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 112 ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ సూచించారు. రోడ్డు ప్రమాదాలు, న్యూసెన్స్ , కుటుంబ తగాదాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గొడవలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికల వివరాలను డయల్ 112 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వెంటనే స్పందించి పట్టణ ప్రాంతాల్లో అయితే బ్లూ కోల్ట్స్, రక్షక్, పోలీస్లు 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలో, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 6 నుంచి 10 నిమిషాలలోపు ఘటనా స్థలానికి చేరుకుంటారన్నారు. సమస్యను తెలుసుకుని, తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు ఈ 112 హెల్ప్ లైన్ నంబర్ 24/7 కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు. గతంలో పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ గా ఉన్న డయల్ 100కు బదులు హెల్ప్ లైన్ నంబర్ 112గా ప్రభుత్వం మార్చిందని చెప్పారు.
● ఎల్.హెచ్.ఎం.ఎస్ యాప్ ద్వారా పోలీసు సేవలను ఉపయోగించుకుని ఇళ్లలోని వస్తువులకు రక్షణ కల్పించుకోవాలనిఎస్పీ అన్నారు.. ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు 8186881100 నంబర్కు స మాచారమిస్తే పోలీసులు వచ్చి మీ ఇంటిలో ఎల్.హెచ్.ఎం.ఎస్ కెమెరాలను అమర్చుతారని ఎస్పీ తెలిపారు.