వివాహిత అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Jun 16 2025 5:43 AM | Updated on Jun 16 2025 5:43 AM

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి

పోరుమామిళ్ల : మండలంలోని దమ్మన్నపల్లె పంచాయతీ సుంకేసులపల్లెలో ఆదివారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెముడూరి నరేంద్ర మండలంలోని కాలువకట్టకు చెందిన మహాలక్ష్మి(25)ని ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆయన తాపీమేసీ్త్రగా పని చేస్తుంటాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భర్తే చంపేసి, ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. నిత్యం తాగుతూ తన కూతురిని చిత్రహింసలకు గురి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర పరారీలో ఉన్నాడు. ఎస్‌ఐ కొండారెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ పూర్తయితే పూర్తి వివరాలు తెలుస్తాయి.

ఆత్మహత్యాయత్నం

మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం శేష్‌మహల్‌ ఏరియాకు చెందిన సురేష్‌(39) భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై ఆదివారం పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement