ప్రకాష్‌నగర్‌లో చోరీ | - | Sakshi
Sakshi News home page

ప్రకాష్‌నగర్‌లో చోరీ

Jun 15 2025 8:05 AM | Updated on Jun 15 2025 8:05 AM

ప్రకా

ప్రకాష్‌నగర్‌లో చోరీ

కడప అర్బన్‌ : కడప నగరంలోని చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రకాష్‌నగర్‌లో నివాసం వుంటున్న భవనాసి శ్రీనివాసులు (ఎల్‌ఐసీ, ఏఏఓ), ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అతని భార్య మేరీ స్టెల్లా శుక్రవారం రాత్రి తమ ఇంటికి లోపలివైపు నుంచి తాళాలు వేసుకుని బెడ్‌రూంలో నిద్రిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వెనుకవైపున కటాంజనం (ఇనుపవాకిలి)కి వేసిన తాళం పగులగొట్టాడు. ఎంచక్కా ఇంటిలోకి ప్రవేశించి బీరువాను తెరిచి అందులోని బంగారు ఆభరణాలను దాదాపు ఏడు తులాలు, రూ.లక్షకు పైగా నగదును దోచుకుపోయాడు. ప్రకా ష్‌నగర్‌లోనే సంచరించిన సదరు దొంగ మూడు ఇళ్లలో కాలింగ్‌బెల్‌ నొక్కి దొంగతనాలకు ప్రయత్నించాడు. వీరి ఇంటిలో దొంగతనం చేశాడు. సీసీపుటేజీల ఆధారంగా దొంగకోసం గాలింపు చర్యలను చేపట్టారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్‌ ఎస్‌ఐ ఎన్‌. రాజరాజేశ్వర్‌రెడ్డి, క్లూస్‌ టీంతోపాటు సిబ్బంది పరిశీలించారు.

వ్యక్తిపై దాడి : కేసు నమోదు

కడప అర్బన్‌ : కడప నగరంలోని ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎర్రముక్కపల్లి సర్కిల్‌ సమీపంలో ఇందిరానగర్‌కు చెందిన చాంద్‌బాషా అనే వ్యక్తిని మనస్పర్థలతో రెడ్డెయ్య, అభి అనే ఇద్దరు శనివారం దాడి చేశారు. గాయపడిన చాంద్‌బాషా రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బి. రామకృష్ణ తెలియజేశారు.

కుటుంబ సమస్యలతో యువకుడు ఆత్మహత్య

మదనపల్లె రూరల్‌ : కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాలిలా.. పట్టణంలోని రామగోపాల్‌నాయుడు వీఽధికి చెందిన ఆదినారాయణ కుమారుడు లోకేష్‌(31)కదిరిరోడ్డులోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడు అవాహితుడు. గత కొంత కాలంగా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ మనస్థాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. టు టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు యువకులను బలిగొన్న

రోడ్డు ప్రమాదం కేసు ఛేదింపు

పెద్దతిప్పసముద్రం : ఈ ఏడాది మార్చి 17న అర్ధరాత్రి పీటీఎం–బి.కొత్తకోట రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లడంతో ఈ దుర్గటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన సాదిలి చందూ కుమార్‌ (20), దండు శీనూ (21) బి.కొత్తకోటలో సెకండ్‌ షో సినిమా చూసి తిరిగి పీటీఎంకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా యువకులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చందూకుమార్‌ తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లారీకి చెందిన వస్తువు ఆధారంగా ఎస్‌ఐ ఈ కేసును సవాల్‌గా తీసుకుని ఎట్టకేలకు ఛేదించారు. ఎస్‌ఐ హరిహర ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు... ప్రమాద స్థలంలో టీఏ అని ఆంగ్ల అక్షరాలు కలిగి ఉన్న పార్కింగ్‌ స్టాండ్‌ పీస్‌ ఆధారంగా కేసును ఛేదించామన్నారు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌కు చెందిన సిమెంటు ట్యాంకర్‌ లారీ ద్విచక్ర వాహనదారులను బలంగా గుద్ది ముందుకు వెళుతుండగా ఈ దృశ్యాన్ని చూసిన పలువురు కేకలు వేస్తున్నప్పటికీ లారీ డ్రైవర్‌ దవరిక యాదవ్‌ (30) వాహనం నిలిపినట్టే నిలిపి ఒక్కసారిగా వేగంగా ముందుకు వెళ్ళిపోయినట్లు విచారణలో వెళ్ళడైందన్నారు. అనంతరం ప్రమాద స్థలంలోని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో పలు చోట్ల ప్రధాన రహదారుల్లోని సీసీ కెమెరాలను క్షుణంగా పరిశీలించి పోలీస్‌ సాంకేతిక నిపుణుల చొరవ, స్థానిక పోలీసు సిబ్బంది సహకారంతో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. అనంతరం వాహన యజమానిని సంప్రదించగా లారీ సహా ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌ శనివారం స్టేషన్‌లో లొగిపోగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

ప్రకాష్‌నగర్‌లో చోరీ 1
1/1

ప్రకాష్‌నగర్‌లో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement