
జేఈఈ ఫలితాల్లో మెరిసిన దొండపాటి
కడప ఎడ్యుకేషన్ : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో కడపకు చెందిన దొండపాటి లలిత్ ప్రసాద్రెడ్డి షార్ట్ టర్మ్లోనే 2411 ర్యాంకు సాధించి ప్రముఖ కాన్పూర్ ఐఐటీలో ఎలక్ట్రానిక్ సీటు సాధించాడు. కడప నగరానికి దొండపాటి సుబోధరెడ్డి(కాంట్రాక్టరు) తల్లి గీతాంజలి (గృహిణి) కుమారుడు లలిత్ ప్రసాద్రెడ్డి కడపలోని మోంటిపోర్ట్ స్కూల్లో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదివాడు. ఆ తరువాత 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నారాయణ స్కూల్ చదివాడు. ఇంటర్మీడియట్ను బెంగళూరులోని నారాయణ జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడ కళాశాల వారు ఇచ్చిన షార్ట్ టర్మ్ కోచింగ్తోనే 2411వ ర్యాంకును సాధించాడు. దొండపాటి లలిత్ ప్రసాద్రెడ్డి సోదరుడు భవాని శంకర్ కూడా మద్రాసు ఐఐటీలో ఏరోస్పేస్ లో సీటు సాధించి చివరి సంవత్సరం చదువుతున్నాడు.
నీట్ ఫలితాల్లో ప్రతిభ
మదనపల్లె సిటీ : నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మదనపల్లెకు చెందిన కె. జయంత్రెడ్డి ప్రతిభ కనబరిచాడు. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో మదనపల్లె పట్టణం రెడ్డీస్ కాలనీకి చెందిన మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్రెడ్డి ,శ్రావణిల కుమారుడు జయంత్రెడ్డి 4571 ఆలిండియా ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్లో రాష్ట్ర స్థాయిలో 48 ర్యాంకు దక్కించుకున్నాడు. ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య కాలేజీలో చదివాడు. ఇంటర్మీడియట్లో 978 మార్కులు సాఽధించాడు. జయంత్రెడ్డిని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.