
జులై 14 నుంచి బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కళాశాలల విద్యార్థుల సెమిస్టర్ పరీక్షలు జూలై 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఈడీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులకు, అలాగే ఎంఈడీ రెండు, నాలుగు సెమిస్టర్ల సప్లిమెంటరీ, రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి జరగాల్సిన బీఈడీ, ఎంఈడీ పరీక్షలను డీఎస్సీ (ఉపాధ్యాయ ఉద్యోగ నియామకపు పరీక్ష) రాసే విద్యార్థుల అభ్యర్థన దృష్ట్యా, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలై 14వ తేదీకి వాయిదా వేశామన్నారు. రీషెడ్యూల్ అయిన తేదీల టైం టేబుల్ విద్యార్థులు చదువుతున్న కళాశాల నుంచి పొందాలని సూచించారు.
ఏపీ ట్రాన్స్కో కడప జోనల్ సీఈగా క్రిష్ణకుమార్
కడప కార్పొరేషన్ : ఏపీ ట్రాన్స్కో కడప జోనల్ చీఫ్ ఇంజినీర్గా డీవీ క్రిష్ణ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఈగా పని చేస్తున్న శ్రీనివాసులును విజయవాడ విద్యుత్ సౌధకు బదిలీ చేశారు. క్రిష్ణ కుమార్ కడపలోనే కన్స్ట్రక్షన్ ఎస్ఈగా విధులు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం ఆయనకు పదోన్నతి కల్పించి సీఈగా నియమించారు. క్రిష్ణ కుమార్కు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీకే వీరభద్రయ్య పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ అందరూ కష్టపడి పని చేసి సంస్థకు మంచిపేరు తీసుకురావాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు శ్రీరామచంద్రమూర్తి, బాషా, ఇంజినీరింగ్ అసోసియేషన్ నాయకులు శ్రీనాథుడు, రామ్మోహన్, వెంకటసుబ్బయ్య, రమణ, నారాయణస్వామి, చంద్రశేఖర్, భాస్కర్నాయుడు, సతీష్, రామిరెడ్డి, నరసింహ, ప్రసాద్రెడ్డి, విష్ణు కుమార్ పాల్గొన్నారు.