
తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తల్లి పరిస్థితి విషమంగా మారిన సంఘటన శనివారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. మండలంలోని వెలిగల్లు పంచాయతీ పడమటివారిపల్లెకు చెందిన నాగిరెడ్డి భార్య జానకమ్మ(30), కుమార్తె వర్షారెడ్డి(10) కుమారుడు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా నాగిరెడ్డి కుటుంబాన్ని నిర్లక్షం చేస్తూ ఇబ్బందులకు గురి చేయడంతో జానకమ్మ తీవ్రంగా మనస్థాపం చెందింది. శనివారం తాను విషం తాగి పిల్లలకు విషం ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా పురుగు మందు జ్యూస్లో కలుపుకుని ఆమె సగం తాగి, కుమార్తె వర్షారెడ్డికి ఇచ్చింది. కుమార్తె కొద్దిగా తాగి చేదుగా ఉందని చెప్పింది. అయితే జానకమ్మ కుమారుడిని పిలవమని చెప్పడంతో వర్షారెడ్డి వెళ్లింది. ఎక్కువ మోతాదులో జానకమ్మ తాగడంతో జానమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు జానకమ్మతో పాటు వర్షారెడ్డిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం జానకమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. పెద్దమండ్యం పోలీసులుకేసు విచారణ చేస్తున్నారు.
తల్లి పరిస్థితి విషమం