● తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. | - | Sakshi
Sakshi News home page

● తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..

Jun 15 2025 8:05 AM | Updated on Jun 15 2025 8:05 AM

● తల్

● తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను జాతీయస్థాయి నీట్‌లో 379వ ర్యాంకు సాధించానని దూదిమణి అక్షయ్‌కీర్తన్‌ తెలిపారు. కడప ద్వారకానగర్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డిప్రసాద్‌(రిమ్స్‌ వైద్యులు), మల్లిక(గైనాకాలజిస్టు)ల కుమారుడు అక్షయకీర్తీన్‌ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కడపలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాడు. పదో తరగతిలో 600కు 590 మార్కులు సాధించి స్కూల్‌ టాపర్‌గా నిలిచాడు. ఇంటర్మీడియెట్‌ను విజయవాడ నారాయణ కళాశాలలో చదివి సెంట్రల్‌ సిలబస్‌లో 500లకు 497 మార్కులు సాధించాడు. ప్రస్తుతం విడుదలైన నీట్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 379వ ర్యాంకు సాధించాడు. ఇంకా బాగా చదివి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి తరువాత కార్డియాలజీ డాక్టర్‌ కావడమే జీవితాశయం అని అక్షయ్‌కీర్తన్‌ తెలిపారు.

● తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. 1
1/1

● తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement