
● గుండె డాక్టర్ కావడమే లక్ష్యం
ఇంకా బాగా చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి గుండె వైద్య నిపుణులుగా సేవలు అందించడమే తన లక్ష్యమని జాతీయస్థాయి నీట్లో 900 ర్యాంకు సాధించిన యారాసి క్రిష్ణప్రశాంత్ తెలిపారు. కడప నగరానికి చెందిన సురేంద్రనాథ్(ప్రొఫెసర్ ఇన్ ఫార్మసీ), జాన్సీలక్ష్మిరెడ్డి( ప్రముఖ దంత వైద్యులు)ల కుమారుడు యారాసి క్రిష్ణప్రశాంత్ 1 నుంచి 7వ తరగతి వరకు రాజమండ్రి, కాకినాడలో చదివాడు. ఆ తరువాత 7 నుంచి 10వ తరగతి వరకు కడపలోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివి పదో తరగతిలో 577 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియెట్ను విజయవాడ నారాయణ జూనియర్ కళాశాలలో చదివి 461 మార్కులు కై వసం చేసుకున్నాడు. ప్రస్తుతం విడుదలైన నీట్లో 900 ర్యాంకు సాధించాడు. తన తల్లిదండ్రులు, గురువుల సూచనలు, సలహాలతోనే ఈ ర్యాంకు సాధించానని క్రిష్ణప్రశాంత్ తెలిపారు.

● గుండె డాక్టర్ కావడమే లక్ష్యం