వేసవి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలలు పండుగ వాతావరణంలో
పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు పచ్చని తోరణాలతో బడులను ముస్తాబు చేసి విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు. బడులు తెరిచిన తొలి రోజు ‘అమావాస్య’ కావడంతో విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు.
– సాక్షి నెట్వర్క్
గుండాల : జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పూలతో
స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు
యాదగిరిగుట్ట : బాలికల ఉన్నత పాఠశాలలో ప్రార్థనకు హాజరైన విద్యార్థులు


