
‘ధర్మారెడ్డిపల్లి’కి కదలికొచ్చింది
కాల్వ ఆధునీకరణ
పనులు పరుగులు
ఫ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్
ఫ పురోగతిలో 108 వంతెనలు
ఫ వెల్లంకి శివారులో వందల సంఖ్యలో కార్మికులతో క్యాంపులు
ఫ డిసెంబర్ నెలాఖరు వరకుపనులు పూర్తయ్యేలా ప్రణాళిక
ఫ రూ.123.98 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
కాల్వ స్వరూపం
నీఇ సామర్థ్యం 50 నుంచి
208 క్యూసెక్కులకు పెంపు
పొడవు 51.51 కి.మీ
పూర్తయినది 29.72 కి.మీ
కాల్వ పరిధిలోని మండలాలు :
వలిగొండ, రామన్నపేట,
చిట్యాల, నార్కట్పల్లి
గ్రామాలు 40 చెరువులు 41
నిర్మిస్తున్న వంతెనలు 108
ఆయకట్టు 17,787 ఎకరాలు
రామన్నపేట: ధర్మారెడ్డి కాల్వ ఆధునీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలో 17,787 ఎకరాలకు సాగు నీరందించే పనులు మొదలయ్యాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో 51.51 కి.మీ మేర కాల్వ విస్తరించి ఉంది. అదనపు ఆయకట్టు స్థిరీకరించి సాగునీరు అందించేలా కాల్వను డిజైన్ చేశారు. పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
పెరిగిన కాల్వ సామర్థ్యం
ధర్మారెడ్డిపల్లి కాలువ పాత సామర్థ్యం 50 క్యూసెక్కులు. స్థిరీకరించిన ఆయకట్టు 5,126 ఎకరాలు. అధనంగా 12,661 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాల్వ సామర్థ్యాన్ని 208 క్యూసెక్కులకు పెంచుతూ ఇరిగేషన్ శాఖ అధికారులు డిజైన్ రూపకల్పన చేశారు. ధర్మారెడ్డిపల్లి కత్వ 0 కి.మీ నుంచి 12.41 కి.మీ (గోకారం చెరువు) వరకు కాల్వ అడుగుభాగం 10 మీటర్ల వెడల్పు (బెడ్విడ్త్), అక్కడి నుంచి చిట్యాల మండలం శివనేని గూడెం వరకు మహాలింగం చెరువు (45.10కి.మీ)వరకు అడుగుభాగం 6 మీ, శివనేనిగూడెం నుంచి ఏపీ లింగోటం (51.51) వరకు అడుగుబాగం 3 మీటర్ల ఉండే విధంగా కాల్వను తవ్వడం ప్రారంభించారు. కాల్వ విస్తరణలో భాగంగా 108 చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. కాల్వ మొత్తం పొడవు 51.51 కి.మీ కాగా.. గతంలో 29.72 కి.మీ మేర విస్తరణ పనులు పూర్తయ్యాయి. 113.09 ఎకరాల భూమి సేకరించి రైతులకు రూ రూ.1.50 కోట్ల పరిహారం చెల్లించారు. మరో 24.20 ఎకరాలను సేకరించే పనులు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించిన కొందరు రైతుల పరిహారం డబ్బులు ఆర్డీలలో జమ చేశారు. కాల్వ ఆధునీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.123.98 కోట్లు మంజూరు చేసింది.
గడువుకు ముందే పూర్తి చేస్తాం
ధర్మారెడ్డిపల్లి కాల్వ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల ప్రగతిని అధికా రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైతులు సహకరిస్తున్నారు.కాల్వ తవ్వకం, సిమెంట్ కాంక్రీట్ పనులు ఏకకాలంలో పూర్తి కానున్నాయి. మిగిలిన భూ సేకరణ, రైతులకు పరిహారం చెల్లింపులు జరుగుతున్నాయి. నిర్ణీత గడువుకంటే ముందే పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
–కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ డీఈ
ముమ్మరంగా పనులు
ధర్మారెడ్డిపల్లి కాల్వ ఆధునీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెల్లంకి, సిరిపురం, వనిపాకల శివారులలో పదకొండు భారీ యంత్రాలు రాత్రింభవళ్లు పనిచేస్తున్నాయి. ఐబీ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు. వెల్లంకి శివారులో వందల సంఖ్యలో కార్మికులతో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు. కాల్వ తవ్వకం పనులకు అడ్డుగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ షిప్ట్ చేస్తున్నారు. యాసంగి సీజన్ నాటికి సాగునీరు అందుతుందనే ఆశతో రైతులు ఉన్నారు.

‘ధర్మారెడ్డిపల్లి’కి కదలికొచ్చింది

‘ధర్మారెడ్డిపల్లి’కి కదలికొచ్చింది