వాసాలమర్రిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

వాసాలమర్రిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Jun 19 2025 7:50 AM | Updated on Jun 19 2025 7:50 AM

వాసాలమర్రిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

వాసాలమర్రిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

తుర్కపల్లి: వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తుర్కపల్లి మండలం వాసారాలమర్రి గ్రామానికి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వాసాలమర్రి పునర్‌ నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, తిరుమలాపూర్‌ సభలోనూ గ్రామ అభివృద్ధిపై ప్రస్తావించారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో గ్రామ పునర్‌నిర్మాణానికి పునాది వేస్తామని చెప్పారు. 227 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, లబ్ధిదారులందరికీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా ప్రొసీడింగ్స్‌ పంపిణీ చేస్తారని వెల్లడించారు. మొదట ఆకుల ఆగవ్వకు ప్రొసీడింగ్‌ కాపీ అందజేస్తామన్నారు. ఇందిరమ్మ గృహాలే కాకుండా పాఠశాలలు, రోడ్లను అభివృద్ధి చేస్తామని, మైలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్పర్సన్‌ చైతన్య మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, నాయకులు దనావత్‌ శంకర్‌నాయక్‌, చాడ భాస్కర్‌రెడ్డి, గడిమీది నిఖిల్‌, బాబు, దుర్వాసులు, రాజారాం నాయక్‌, భాస్కర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాక

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

బండసోమారంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించనున్న మంత్రి

భువనగిరి : మండలంలోని బండసోమారం గ్రామానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రానున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు గ్రామానికి చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారని పేర్కొన్నారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాకు బయలుదేరి వెళ్తారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement