భూ భారతితో సమస్యలు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యలు సత్వర పరిష్కారం

Jun 19 2025 7:50 AM | Updated on Jun 19 2025 7:50 AM

భూ భారతితో సమస్యలు సత్వర పరిష్కారం

భూ భారతితో సమస్యలు సత్వర పరిష్కారం

యాదగిరిగుట్ట: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ హనుమంతరావు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధి యాదగిరిపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్‌ పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి భూ సమస్యలపై తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామగ్రామన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు సహకరించేందుకు సదస్సుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. యాదగిరిపల్లికి చెందిన దండు విజయలక్ష్మి భూమిని ఆమెకు తెలియకుండా రికార్డులనుంచి తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు మిట్ట వెంకటయ్యగౌడ్‌, సీస కృష్ణ, బరిగే రాంచందర్‌ విన్నవించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ గణేష్‌, డీటీ సత్యం, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement