
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
చౌటుప్పల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారని, విద్యార్థులకు నాణ్య మైన విద్య అందుతుందని డీఈఓ సత్యనారాయణ అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, డిజిటల్ క్లాస్, పాఠశాల ఆవరణను పరిశీలించారు. బోధన తీరుపై ఆరా తీశారు. అడ్మిషన్లు ఎలా ఉన్నాయని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సులువైన రీతిలో పాఠాలు అర్థమయ్యేలా బోధనం చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. ప్రాథమిక దశలోనే లక్ష్యాలను ఎంచుకుని పట్టుదలతో చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నల్లెంకి శంకరయ్య, ఉపాధ్యాయులు శ్వేత, విజయ్ప్రతాప్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ సత్యనారాయణ