ఆగిరిపల్లి: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లిలో మాజీ గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా ప్రారంభించిన సత్య కేంద్రాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామంలో కుటుంబ తగాదాలు, గ్రామ సమస్యల పరిష్కారం కోసం 1993లో రాష్ట్రంలోనే మొదటిసారిగా కనసానపల్లిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిపై గ్రామానికి చెందిన పచ్చ నేతల కన్ను పడింది. సత్య కేంద్రాన్ని పునర్నిర్మాణం చేస్తామంటూ గ్రామస్తులను సంప్రదించకుండానే ఆదివారం ఉదయం ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


