
రౌడీ షీటర్ దారుణ హత్య
మరికొన్ని హత్యలు ఇలా..
కమిషనరేట్ పరిధిలో
కలకలం రేపుతున్న
వరుస హత్యలు
● వివాహేతర సంబంధం..
భూ పంచాయితీలే ప్రధాన కారణం
● మౌనం వీడని పోలీసులు..
పోలీసింగ్పై అనుమానాలు..
● జనవరి 22న సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత కోసం ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. సుబేదారిలోని డీమార్ట్ ఎదురుగా ఏనుగు వెంకటేశ్వర్లు అనే నిందితుడు మాచర్ల రాజ్కుమార్ను నడిరోడ్డుపై జనం చూస్తుండగా హత్య చేశాడు.
● ఫిబ్రవరి 20న రాత్రి 10.30 గంటల సమయంలో మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి భట్టుపల్లి దగ్గర డాక్టర్ సుమంత్రెడ్డిని ఆయన భార్య ఫ్లోరా తన ప్రియుడు సామ్యూల్, మరో నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్కుమార్తో హత్య చేయించింది.
● ఏప్రిల్ 12న నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మాలు హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు నిర్ధారించారు.
● ఏప్రిల్ 18న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రి వద్ద చిద్దం సాయి ప్రకాశ్ను కిడ్నాప్ చేసి 18న హత్య చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో క్రిష్ణవేణి అనే మహిళ తన బావ కొడుకును తన ప్రియుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, మరో నలుగురు కలిసి హత్య చేశారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్ /వరంగల్ క్రైం:
బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ సాదిక్ హుస్సేన్ తను ఇచ్చిన అప్పు డబ్బులు ఇవ్వమన్నందుకుగాను సోహెల్, బషీర్, అక్రమ్ అనే నిందితులు అతడి తలపై బండతో మోది హత్య చేశారు.
ఈనెల 11న కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లిలో తనకు రావాల్సిన భూమిని ఇవ్వనివ్వడం లేదని చల్లా భూపాల్రెడ్డి తన పినతల్లి అయిన సరోజనను గొడ్డలితో నరికి హత్య చేశాడు.
ఈనెల 7న గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని స్తంభంపల్లిలో జల్సాలకు అలవాటు పడిన రేకలపల్లి ప్రణయ్ తన మేనత్త స్వరూపను బంగారం, డబ్బుల కోసం హత్య చేశాడు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకే నెలలో మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అందులోనూ హనుమకొండ సబ్ డివిజన్లో ఒక్కనెలలోనే రెండు హత్యలు జరగడం, అది నగరంలో రోడ్డు మీద కిరాతకంగా చంపుతుండడంతో పోలీసింగ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి జనం తిరుగుతున్న సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహ్మద్ సాదిక్ హుస్సేన్ హత్య మరోసారి సంచలనం కలిగించింది. రాత్రి 10 గంటల తరువాత నిర్వహించాల్సిన పెట్రోలింగ్ ఏమైంది? బ్లూకోల్ట్ సిబ్బంది ఎక్కడ? విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారన్న అనేక ప్రశ్నలు తలెత్తుతున్నా పోలీసులు మౌనం వీడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల్లో 18 హత్యలు, 32 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
వివాహేతర సంబంధాలు..
ఆస్తి పంచాయితీలు?
ఇటీవల జరుగుతున్న హత్యలకు వివాహేతర సంబంధాలు, భూ, ఆస్తి పంచాయితీలో ప్రధాన కారణా లు అవుతున్నాయి. అప్పుగా ఇచ్చిన డ బ్బులను అడిగినందు కు సాదిక్ హుస్సేన్ హత్య కు గురికాగా, పినతల్లి తనకు రావాల్సిన భూమిని రాకుండా చేస్తుందని కేయూ పీఎస్ పరిదిలో సరోజన అనే మహిళా హత్యకు గురైంది. జల్సాలకు అలవాటు పడ్డ మరో యువకుడు ఈఎంఐలను కట్టడం కోసం సొంత మేనత్తను హత్య చేసిన సంఘటన గీసుగొండ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. సులువుగా డబ్బులు సంపాదించడం.. చిన్ని చిన్న గొడవలు చివరికి హత్యల వరకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయి.
హత్య కేసుల్లో పోలీసులు?
పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరు. కానీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ యేడాది జ రిగిన మూడు హత్య కేసుల్లో నిందితులు పోలీస్లు కావడం గమనార్హం. ఇది పోలీస్ శాఖకు మాయని మచ్చగా మారింది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్. అతను గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికి పద్ధతి మార్చుకోలేదు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన డాక్టర్ సుమంత్రెడ్డి హత్య కేసుల్లో ఉన్న నిందితుడు ఎం.రాజ్కుమార్ ఏఆర్ కానిస్టేబుల్. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 18న జరిగిన చిద్దెం సాయి ప్రకాశ్ హత్య కేసు నిందితుడు బాషబోయిన శ్రీనివాస్ కూడా కానిస్టేబుల్.
ఆరు నెలల్లో
18
హత్యలు..
32
హత్యాయత్నాలు
ఆర్థిక లావాదేవీలే కారణం
ఇంట్లో నుంచి తీసుకొచ్చి తలపై
బండరాయితో మోది ఘాతుకం
నిందితుల్లో పోలీస్ కానిస్టేబుల్
– వరంగల్ క్రైం
– వివరాలు 8లోu

రౌడీ షీటర్ దారుణ హత్య