కమిషనర్‌తో మాజీ కౌన్సిలర్‌ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

కమిషనర్‌తో మాజీ కౌన్సిలర్‌ పంచాయితీ

Jun 27 2025 4:09 AM | Updated on Jun 27 2025 4:09 AM

కమిషనర్‌తో మాజీ కౌన్సిలర్‌ పంచాయితీ

కమిషనర్‌తో మాజీ కౌన్సిలర్‌ పంచాయితీ

పరకాల: విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా.. అసభ్యంగా ప్రవర్తించిన పరకాల మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ ఆర్‌పీ జయంత్‌లాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ పరకాల మున్సిపల్‌ కమిషనర్‌ కొడారి సుష్మ స్థానిక పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. కమిషనర్‌ సుష్మ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర రాజయ్య అనే దంపతులు ఇంటిపక్కన అనుమతిలేకుండా తమ స్థలంలో నిర్మాణం చేసిన గోడను కూల్చివేయాలంటూ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కార్యాలయంలోకి దూసుకొచ్చిన ఆర్‌పీ.జయంత్‌లాల్‌ ‘మీకు పనిచేయడం చేతకాదు’ అంటూ దురుసుగా, అసభ్యపదజాలంతో మాట్లాడారు. అక్కడినుంచి కమిషనర్‌ చాంబర్‌లోకి అనుమతి లేకుండానే దూసుకొచ్చి విధులకు ఆటంకం కలిగిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడటంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్‌గా ఎంతకాలం పనిచేస్తావో చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అక్కడే ఉన్న సూర రాజయ్య దంపతులను క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించినట్లు కమిషనర్‌ సుష్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పరకాల పోలీసులు 21వ వార్డు మాజీ కౌన్సిలర్‌ జయంత్‌లాల్‌పై కేసు నమోదు చేశారు.

విధులకు ఆటంకం కలిగించారని మున్సిపల్‌ కమిషనర్‌ సుష్మ ఫిర్యాదు

బీజేపీ కౌన్సిలర్‌ జయంత్‌లాల్‌పై

కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement