
వృత్తి నైపుణ్యం సాధించాలి
● సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు విధుల్లో రాణించాలంటే నైపుణ్యం సాధించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. యూనిట్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. డ్యూటీ మీట్లో విభాగాల వారీగా రాణించిన కమిషనరేట్ పరిధి పోలీసులను జోనల్ స్థాయిలో నిర్వహించే మీట్కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈఏడాది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ పోటీలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు వృత్తినైపుణ్యం సాధించడం ద్వారా, నేరస్తులను త్వరగా గుర్తించడంతో పాటు, ప్రజలకు సత్వరమే న్యాయం అందించగలమన్నారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్ అదనపు డీసీపీ రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్తో పాటు, జోనల్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
క్షయ రహిత
జిల్లాగా మారుద్దాం
ఎంజీఎం: ప్రజల భాగస్వామ్యంతో క్షయరహిత జిల్లాగా మారుద్దామని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు అన్నారు. గురువారం టీబీ అలర్ట్ ఇండియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పిల్లలో క్షయ వ్యాధి నివారణ గురించి ఐఎంఏ హాల్లో శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. డివిజన్, మండల స్థాయిలో పిల్లల్లో క్షయను గుర్తించడంపై అవగాహన, చైతన్యకార్యక్రమాలు నిర్వహించాలన్నారు. క్షయ అంటువ్యాధి అని ప్రీవలెన్స్ రేట్ రోజురోజుకూ అధికమవుతోందన్నారు. ఎవరికై నా క్షయ లక్షణాలు కనిపిస్తే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సాయంతో పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, క్షయ వ్యాధి నియంత్రణ ప్రోగ్రాం అధికారి ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
న్యాయ విజ్ఞానానికి
ఇ–లైబ్రరీ దోహదం
వరంగల్ లీగల్: న్యాయ విజ్ఞానానికి ఇ–డిజిటల్ లైబ్రరీ ఎంతో ఉపయోగకరమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తెలిపారు. వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ఇ–లైబ్రరీని గురువారం అమె ప్రారంభించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.పట్టాభిరామరావు, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, జాయింట్ సెక్రటరీ ముసిపెట్ల శ్రీధర్గౌడ్, లేడీ జాయింట్ సెక్రటరీ రేవూరి శశిరేఖ, లైబ్రరీ సెక్రటరీ గుండా కిషోర్కుమార్, ట్రెజరర్ సిరుమల్ల అరుణ, తదితరులు పాల్గొన్నారు.
రైతు భరోసా
రూ.126.80 కోట్లు జమ
హన్మకొండ: హనుమకొండ జిల్లా రైతుల ఖా తాల్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరో సా కింద రూ.126.80కోట్లు జమ చేసినట్లు జి ల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్ తెలిపా రు. వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులకు పెట్టుబడి సాయంగా జిల్లాలోని 14 మండలాలకు చెందిన 1,35,765 రైతులకు రూ. 126,80,04,861 జమ చేసినట్లు తెలిపారు.
మండలాల వారీగా వివరాలు..
మండలం రైతులు జమైన సొమ్ము
భీమదేవరపల్లి 10493 11,46,09,577
ధర్మసాగర్ 11433 11,51,59,864
ఎల్కతుర్తి 11321 10,78,32,732
హనుమకొండ 1230 73,19,256
హసన్పర్తి 13475 10,98,42,270
ఐనవోలు 12520 12,43,15,115
కమలాపూర్ 15501 14,22,97,512
కాజీపేట 5480 3,89,36,293
వేలేరు 8052 9,05,51,910
ఆత్మకూరు 10169 8,56,54,862
దామెర 7528 7,21,11,422
నడికూడ 10376 9,85,11,112
పరకాల 7242 6,39,24,143
శాయంపేట 10945 9,69,38,793

వృత్తి నైపుణ్యం సాధించాలి