చిట్టి చేతులు.. గట్టి సంకల్పం | - | Sakshi
Sakshi News home page

చిట్టి చేతులు.. గట్టి సంకల్పం

Jun 21 2025 2:53 AM | Updated on Jun 21 2025 2:53 AM

చిట్ట

చిట్టి చేతులు.. గట్టి సంకల్పం

విద్యారణ్యపురి: ‘ఆధునిక సమాజంలో అభివృద్ధి పేరిట మానవాళి చర్యలతో పర్యావరణానికి నష్టం కలుగుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవాళిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జీవవైవిద్యానికి కూడా ముప్పువాటిల్లుతోంది’ అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపక్రమించింది. అందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎకో క్లబ్‌ ఫర్‌ మిషన్‌ లైఫ్‌’ కార్యక్రమాన్ని రూపొందించింది. పర్యావరణ పరిరక్షణ దిశగా విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏకో క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

ఆగస్టు నెలాఖరులోపు ఎకో క్లబ్‌లు

ఆగస్టు 31 లోపు హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్‌లను నూతనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాలలోనూ ఏకోక్లబ్‌ల నిర్మాణం కార్యకలాపాలు ఇలా ఉండనున్నాయి.

నీటి నిలువ క్లబ్‌: నీటి పొదుపు, సంరక్షణపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

నేల నిర్వహణ క్లబ్‌: నేల సంరక్షణ స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై దృష్టి

శక్తి నిర్వహణ క్లబ్‌: శక్తి వనరుల సమర్థవంతమైన వినియోగం

వ్యర్థ నిర్వహణ క్లబ్‌ వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్‌, జీవ వైవిధ్య క్లబ్‌: జీవ వైవిద్య సంరక్షణ, పరిరక్షణ.

● పాఠశాలల్లో విద్యార్థులతో ఎకో క్లబ్‌ కమిటీల ఏర్పాటు ఒక్కో ఎకోక్లబ్‌లో చురుకై న 10 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో పాఠశాలలో 50 మంది విద్యార్థులను ఈకార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు. వీరంతా పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలు నిర్వహించా ల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు హెచ్‌ఎంలను ఇప్పటికే ఆదేశించారు.

విద్యార్థులకు అవగాహన సదస్సులు..

ఎకో క్లబ్‌ల ద్వారా విద్యార్థులకు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. శక్తి ఆదా విద్యుత్‌ ఇతర శక్తి వనరులు ఎలా ఆదా చేయాలనేది, నీటి వృథాను అరికట్టి సంరక్షణ పద్ధతులను తెలియజేయడం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించడం. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించడంపై అవగాహన కల్పిస్తారు. తదితర కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయనున్నారు.

పీఎంశ్రీ స్కూళ్లకు నిధుల మంజూరు..

హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 492 పాఠశాలలు ఉండగా.. అందులో 145 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు ఉన్నాయి. వరంగల్‌ జిల్లాలో 634 పాఠశాలలున్నాయి. అందులో 142 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా.. ఏకోక్లబ్‌ ఫర్‌ మిషన్‌లైఫ్‌ కార్యక్రమాల నిర్వహణకు హనుమకొండ, వరంగల్‌ జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్‌కు ఒక్కో స్కూల్‌కు రూ.10 వేల చొప్పున నిధులు కూడా మంజూరయ్యాయి. వరంగల్‌ జిల్లాలో 14 పీఎం శ్రీస్కూళ్లకు, హనుమకొండ జిల్లాలో 16 పీఎంశ్రీ స్కూళ్లకు ఒక్కో స్కూల్‌కు రూ.10 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. మిగతా పాఠశాలల్లో ఎకో క్లబ్‌లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు మంజూరు కాతేదు.

అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసుకోవచ్చు

ఎకో క్లబ్‌లను అన్ని పాఠశాలల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. సంవత్సరం పొడవునా నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఎప్పటికప్పుడు ఎకో క్లబ్‌ ఫర్‌ మిషన్‌ లైఫ్‌కు సంబంధించిన పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

– సుజన్‌తేజ, కమ్యూనిటీ మొబిలైజింగ్‌ కో–ఆర్డినేటర్‌, వరంగల్‌

గతంలోకంటే మరింత మెరుగ్గా..

పాఠశాలల్లో ఎకో క్లబ్‌ల విద్యార్థుల ద్వారా కమిటీలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్య తకు చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈక్లబ్‌ల ద్వారా అవగాహన పెంచుకుని మొక్కలను కూడా నాటి సంరక్షించాల్సి ఉంటుంది. పీఎం శ్రీ స్కూల్స్‌కు నిధులు మంజూరు ఇచ్చినందున ఆ నిధులను కూడా కార్యక్రమాల నిర్వహణకు ఆయా స్కూల్స్‌ ఏకో క్లబ్‌లు వినియోగించుకోవచ్చు.

– శ్రీనివాస్‌, కమ్యూనిటీ మొబిలైజింగ్‌

కో–ఆర్డినేటర్‌, హనుమకొండ

ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎకో క్లబ్‌ ఫర్‌ మిషన్‌ లైఫ్‌’

పర్యావరణ పరిరక్షణలో

విద్యార్థుల భాగస్వామ్యం

ఒక్కో పీఎం శ్రీ స్కూల్‌కు

రూ.10 వేలు

చిట్టి చేతులు.. గట్టి సంకల్పం1
1/2

చిట్టి చేతులు.. గట్టి సంకల్పం

చిట్టి చేతులు.. గట్టి సంకల్పం2
2/2

చిట్టి చేతులు.. గట్టి సంకల్పం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement