
కనీస ప్రమాణాలు పాటించాలి..
హన్మకొండ అర్బన్: జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు కనీస ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరెట్లో జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు ఆశ్రయం పొందుతున్న బాల బాలికలకు వసతి, భోజనం, విద్యా, వైద్యంతో పాటు సరైన వసతులు కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోబోయే చర్యల గురించి వివిధ శాఖల టోల్ ఫ్రీ నంబర్లను డిస్ప్లే చేయాలని సూచించారు. ఈనెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్, ఆరుగురు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకావాలని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, బాల రక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం.మౌనిక, మేనేజర్ ఎ.మాధవి, జిల్లా ఇన్స్పెక్షన్న్ కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, సిస్టర్ జెస్సీ సిరియాక్, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
23 నుంచి బాలల
సంరక్షణ కేంద్రాల తనిఖీ