
ప్రవీణ్కు ఆర్మీ అధికారుల గౌరవ వందనం
శాయంపేట: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అరికిల్ల ప్రవీణ్ కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్మీ క్యాంపు నుంచి ముగ్గురు ఆర్మీ అధికారులు మైలారం గ్రామానికి చేరుకుని ప్రవీణ్ కుటుంబ సభ్యులకు జాతీయ జెండా(ఫ్లాగ్) అందజేశారు. అనంతరం ప్రవీణ్ అంతిమయాత్రలో పాల్గొని తిరిగి వెళ్లిపోయారు.
శునకం.. కన్నీటిపర్యంతం
ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్ ప్రవీణ్ అంతిమసంస్కారాలకు సిద్ధం చేస్తున్న క్రమంలో పెంపుడు శునకం.. శవ పేటికపై తలపెట్టి కన్నీటి పర్యంతమై విశ్వాసం చాటుకుంది.

ప్రవీణ్కు ఆర్మీ అధికారుల గౌరవ వందనం