
ముగిసిన బడిబాట
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 6నుంచి ప్రారంభమైన బడిబాట గురువారం ముగిసింది. చివరిరోజు వివిధ పాఠశాలల్లో విద్యార్ధులకు క్రీడలను నిర్వహించారు. నడికూడ పాఠశాలలో విద్యార్థుల క్రీడాపోటీలను జెడ్పీ సీఈఓ విద్యాలత పాల్గొని ప్రారంభించారు. దామెర మండలం ఊరుగొండ ఉన్నతపాఠశాలలో క్రీడలను కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడలను ఎంఈఓ నెహ్రూ ప్రారంభించారు. మొత్తంగా బడిబాట ముగిసేనాటికి హనుమకొండ జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 3,228మంది విద్యార్థులు నూతనంగా నమోదు అయ్యారు. అందులో ఒకటవ తరగతిలో 1,133మంది ప్రవేశాలు పొందారని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు.