
‘ఉపాధి’ పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి
పాన్గల్: ప్రతి గ్రామపంచాయతీలో 150 మందికి తగ్గకుండా ఉపాధి కూలీలకు పని కల్పించాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వేసవి దృష్ట్యా కూలీలతో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే పని చేయించాలని, రోజు కూలి రూ.307 వచ్చేలా మార్కింగ్ ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో అన్ని వసతులు కల్పించాలని.. ఇందిరమ్మ కమిటీలతో సమావేశాలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఎంపీడీఓ గోవిందరావు, ఎంపీఓ రఘురాములు, ఏపీఓ కుర్మయ్య, ఈసీ అంజన్రెడ్డి, ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో వసతుల కల్పన
వీపనగండ్ల: ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు డీఆర్డీఓ ఉమాదేవి తెలిపారు. బుధవారం గోవర్ధనగిరి, వీపనగండ్ల, కల్వరాల, సంగినేనిపల్లి, బొల్లారం, తూంకుంటలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక కాంగ్రెస్పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ, నాగర్కర్నూల్ జిల్లా పర్యాటక అధికారి నర్సింహ, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య పాల్గొన్నారు.