దుర్గాదేవిని దర్శించిన ఢిల్లీ హైకోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

దుర్గాదేవిని దర్శించిన ఢిల్లీ హైకోర్టు జడ్జి

Jun 20 2025 5:21 AM | Updated on Jun 20 2025 5:21 AM

దుర్గాదేవిని దర్శించిన ఢిల్లీ హైకోర్టు జడ్జి

దుర్గాదేవిని దర్శించిన ఢిల్లీ హైకోర్టు జడ్జి

వంగర: మండల పరిధి రుషింగి గ్రామంలో వెలసిన దుర్గాదేవి అమ్మవారిని ఢిల్లీ హైకోర్టు జడ్జి గేదెల తుషార్‌రావు గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉమామహేశ్వరరావు, చిన్నిలు ఆయనకు వేదాశీస్సులు అందజేశారు. అమ్మవారి దర్శనభాగ్యం ఎంతో ఆనందాన్నిచ్చిందని, ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా రుషింగి దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుంటానని ఆయన వెల్లడించారు. ఆయన వెంట న్యాయవాదులు యలకల రమేష్‌, యలకల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ యలకల దుర్గాప్రసాద్‌, చీమల విశ్వనాథం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement