‘యోగాంధ్ర’ ట్రయల్‌ రన్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

‘యోగాంధ్ర’ ట్రయల్‌ రన్‌ విజయవంతం

Jun 20 2025 5:21 AM | Updated on Jun 20 2025 5:21 AM

‘యోగాంధ్ర’ ట్రయల్‌ రన్‌ విజయవంతం

‘యోగాంధ్ర’ ట్రయల్‌ రన్‌ విజయవంతం

విజయనగరం అర్బన్‌: విశాఖలో ఈ నెల 21న నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం కోసం జిల్లా నుంచి శుక్రవారం చేపట్టిన ట్రయల్‌రన్‌ విజయవంతంగా జరిగింది. కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో జిల్లా నుంచి 16 బస్సులలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, లైజన్‌ అధికారులు ప్రయాణించారు. రహదారి మధ్యలో ఎస్పీ వకుల్‌జిందల్‌, వేదికల ఇన్‌చార్జి రోణంకి కూర్మనాథ్‌, ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జేసీ సేతుమాధవన్‌, అదనపు ఎస్పీ సౌమ్యలత, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ తదితరులు బస్సులో ఎక్కి కలెక్టర్‌తో పాటు వేదిక వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణం చేశారు. బస్సులన్నీ జాతీయ రహదారి గుండా ప్రయాణించి మారికవలస నుంచి తిమ్మాపురం బీచ్‌ వద్దకు చేరుకొని బస్సుల రూట్లను, దిగే స్థలాలను, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. జిల్లా నుంచి వెళ్లే 660 బస్సుల కోసం తొట్లకొండ, ఏపీఐఐసీ హిల్స్‌, బావి కొండలు, ఐటీ హిల్స్‌ వద్ద 4 చోట్ల పార్కింగ్‌ కోసం కేటాయించారు. జిల్లాకు 30 కంపార్ట్‌మెంట్‌లను కేటాయించారు. సుమారు వెయ్య మందికి ఒక కంపార్ట్‌మెంట్‌ చొప్పున కేటాయించి, ప్రతి కంపార్ట్‌మెంట్‌కు నంబర్‌ను రాయడం వల్ల అది ఏ రూట్‌లో ఉందో తెలియజేయడానికి పోలీస్‌ అధికారులను నియమించారు. లైజన్‌ అధికారులు వారికి కేటాయించిన బ్లాక్‌ల వద్దకు వెళ్లి పరిశీలించారు.

మారికవలస మీదుగా తిమ్మాపురం బీచ్‌కు బస్సురూట్‌

జిల్లాకు 30 కంపార్ట్‌మెంట్‌లు

4 చోట్ల పార్కింగ్‌ స్థలాల కేటాయింపు

పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన కలెక్టర్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement