
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికకు ఆమోదం
వంగర: మడ్డువలస ప్రాజెక్టు పరిధిలోని శ్రీ సీతారామ ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహణకు మత్స్యకార సొసైటీ సభ్యులు 258 మంది చేతులెత్తి ఆమోదం తెలిపారని ఆ శాఖ రాజాం అసిస్టెంట్ ఇనెస్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మగ్గూరులో మత్స్యకార సొసైటీ మహాజనసభను గురువారం నిర్వహించారు. సభకు పూర్తిస్థాయిలో కోరం ఉండడంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించాలని సభ్యులు చేతులెత్తి ఆమోదం తెలిపారన్నారు. నివేదికను కలెక్టర్కు అందజేస్తామని ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
శివడవలస వైపు ఏనుగులు
బొబ్బిలిరూరల్: మండలంలోని ముత్తాయివలస గ్రామ సమీపంలో గురువారం సంచరించిన ఏనుగులు రాత్రికి శివడవలస గ్రామం వైపు వేళ్లే అవకాశాలున్నాయని ఫారెస్టు అధికారులు తెలిపారు. ఆ మేరకు ఆ గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ఏనుగుల గుంపులోని నెలల వయసున్న ఏనుగును సురక్షితంగా ఉంచేందుకు మూకమ్మడిగా ప్రయత్నిస్తాయని, వాటికి హాని కలుగుతుందని పసిగడితే గ్రామాలపైకి వచ్చిదాడులు చేస్తాయన్నారు. వాటి పయనానికి ఇబ్బందులు, ఆటంకం కలిగించరాదని రైతులకు సూచించారు.
ఆశ వర్కర్ల సమ్మె సైరన్
● డీఎంహెచ్ఓకు సమ్మెనోటీస్ అందజేత
విజయనగరం ఫోర్ట్: సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా ఆశవర్కర్లు సమ్మె సైరన్ మోగించారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొంటామని పేర్కొంటూ డీఎంహెచ్ఓ బి.సుధారాణికి గురువారం సమ్మెనోటీస్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కార్మిక చట్టాలను పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు కనీసవేతనం చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎం.సూరీడు, జి.సుశీల, ఎస్.వాణికుమారి, జి.యశోద, ఆర్.కుమారి, తదితరులు పాల్గొన్నారు.

బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికకు ఆమోదం