ఉద్యోగ భరోసా కల్పిస్తే విధులకు హాజరవుతాం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భరోసా కల్పిస్తే విధులకు హాజరవుతాం

Apr 18 2025 1:31 AM | Updated on Apr 18 2025 1:31 AM

ఉద్యోగ భరోసా కల్పిస్తే విధులకు హాజరవుతాం

ఉద్యోగ భరోసా కల్పిస్తే విధులకు హాజరవుతాం

కొత్తవలస:

ద్యోగ భరోసా కల్పిస్తేనే విధులకు హాజరువుతామని అప్పన్నపాలెం జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కర్మాగారం కార్మికులు స్పష్టంచేశారు. యాజమాన్యం తీరుకు నిరసనగా కార్మికలు రెండు రోజులుగా విధులను బహిష్కరించారు. కర్మాగారం యాజమాన్యంతో వైఎస్సార్‌టీయూసీ (కార్మిక సంఘం) జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి గణేష్‌, సీఐటీయూ నాయకులు టి.సూర్యనారాయణ, కార్మిక సంఘ నాయకులు గురువారం చర్చలు జరిపారు. కార్మికులకు ఉద్యోగ భరోసా కల్పిస్తూ రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కర్మాగారం హెచ్‌ఆర్‌ మేనేజర్‌ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితిని టాప్‌ మేనేజ్‌మెంట్‌కు మెయిల్‌ చేశానని, అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయుకులు లగుడు వామాలు, గాడి అప్పారావు పాల్గొన్నారు.

స్పష్టంచేసిన జిందాల్‌ కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement