యూనియన్‌ బ్యాంక్‌ ఎన్‌ఆర్‌ఐ కార్నివాల్‌ | - | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంక్‌ ఎన్‌ఆర్‌ఐ కార్నివాల్‌

Jan 9 2026 7:06 AM | Updated on Jan 9 2026 7:06 AM

యూనియన్‌ బ్యాంక్‌ ఎన్‌ఆర్‌ఐ కార్నివాల్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఎన్‌ఆర్‌ఐ కార్నివాల్‌

మద్దిలపాలెం: ప్రవాసీ హమారా గౌరవ్‌ ప్రచారంలో భాగంగా గురువారం యూనియన్‌ బ్యాంక్‌ జోనల్‌, రీజనల్‌ కార్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో డాల్ఫిన్‌ హోటల్‌లో ఎన్‌ఆర్‌ఐ కార్నివాల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈడీ అమరీష్‌ ప్రసాద్‌, ఐబీడీ జీఎం సత్యజిత్‌ మహంతి, జీఎం డాక్టర్‌ హెచ్‌టీ వానప్ప, రీజనల్‌ హెడ్‌ జె.సింహాచలం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకు ప్రస్తుత, నూతన ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులతో వ్యక్తిగతంగా అనుసంధానం కావడానికి, వారి సహకారాన్ని గుర్తించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. బ్యాంకింగ్‌ సమస్యల పరిష్కారం, పెట్టుబడి ప్రయోజనాలు, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానలిచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement