తాళం వేయడంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

తాళం వేయడంపై ఆగ్రహం

Jan 14 2026 7:10 AM | Updated on Jan 14 2026 7:10 AM

తాళం వేయడంపై ఆగ్రహం

తాళం వేయడంపై ఆగ్రహం

1902 నుంచి ఉపయోగిస్తున్న ఈ భవనానికి కార్పొరేటర్‌ కోడూరు అప్పలరత్నం తాళం వేసి జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌కు అప్పగించారు. ఈ బంగ్లా వివాదంపై 2017 నుంచి హైకోర్టులో కేసు ఉంది. ఈ స్థలంపై తమకు సంబంధం లేదని జీవీఎంసీ అప్పట్లోనే హైకోర్టుకు రాతపూర్వకంగా సమర్పించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. ఇంతలో కార్పొరేటర్‌ బంగ్లాకు తాళం వేయడం సరికాదు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాయి. అన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బంగ్లాకు సంబంధించి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. నిబంధనలు విరుద్ధంగా బంగ్లాకు తాళం వేసిన కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి. తక్షణమే బంగ్లాను తెరిపించాలని, లేనిపక్షంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. –పూడిపెద్ది శర్మ, విశ్వహిందూ పరిషత్‌ మహానగర్‌ నేత, విశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement