లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కు రూ.2.75 లక్షల విరాళం
తాటిచెట్లపాలెం: సీతమ్మధారలోని లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ను బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డి.భారతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె లయన్స్ ఆస్పత్రి సేవలను కొనియాడుతూ.. హాస్పిటల్ అభివృద్ధికి రూ.2.75 లక్షల విరాళాన్ని హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వి.ఉమామహేశ్వరరావుకు అందజేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ భారతి ఉదార విరాళానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మొత్తాన్ని హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంతోపాటు ఇతర వైద్య విభాగాలను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నారు.


