
ప్రజల రవాణా సదుపాయంపై సమీక్ష
మహారాణిపేట: యోగా వేడుకలకు హాజరయ్యే ప్రజలకు కల్పించే రవాణా సదుపాయాలపై మంత్రులు సమీక్షించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమయ్యారు. ప్రజలు సులభంగా ఆయా వేదికల వద్దకు చేరుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల కేటాయింపు, తరలింపు, పార్కింగ్ తదితర విషయాల్లో అనుసరిస్తున్న విధానాలపై అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.