సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Jun 16 2025 5:05 AM | Updated on Jun 16 2025 5:05 AM

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం భద్రతా వాహన శ్రేణి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ ట్రయల్‌ రన్‌ విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమై నోవాటెల్‌ హోటల్‌, ఆర్‌.కె.బీచ్‌, ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌, పీఎంపాలెం ప్రదేశాల మీదుగా సాగింది. ముఖ్యమంత్రి పర్యటించే మార్గంలో భద్రతా లోపాలు లేకుండా చూసేందుకు ఈ ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, ఆర్డీవో శ్రీలేఖ విమానాశ్రయంలో వివిధ శాఖల అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement