
యోగాంధ్రలో పాల్గొనేందుకు క్యూఆర్ కోడ్ సౌకర్యం
డాబాగార్డెన్స్: ఈ నెల 21న రామకృష్ణా బీచ్ నుంచి భీమిలి వరకు నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. ద్వారకాబస్టేషన్లోని ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకాబస్టేషన్ యూనిట్ ఇన్చార్జ్ పీబీఎంకే రాజు, వర్మ, హరిశంకర్తో పాటు పలువురు సూపర్వైజర్లు , ప్రయాణికులు పాల్గొన్నారు.