
‘హెచ్పీవీ వ్యాక్సిన్పై అపోహలు వద్దు’
ఏయూక్యాంపస్: హెచ్పీవీ వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు వీడాలని వైద్యులు సూచించారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కాంకర్ హెచ్పీవీ–క్యాన్సర్ కాన్క్లేవ్ను కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి శుక్రవారం ప్రారంభించి, మాట్లాడారు. మహిళల్లో రొమ్ముక్యాన్సర్ తర్వాత అత్యధికంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కనిపిస్తోందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీనిని నివారించడం సాధ్యపడుతుందన్నారు. ఆపోహలు వీడి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆంధ్ర మెడికల్ కళాశాల ఆచార్యులు డాక్టర్ విద్య రమ మాట్లాడుతూ సీ్త్ర, పురుషులకు వచ్చే అనేక క్యాన్సర్లను హెచ్పీవీ వ్యాక్సిన్ నిరోధిస్తుందన్నారు. 9 నుంచి 15 ఏళ్ల వయసు వారికి రెండు డోసులు, ఆపైబడిన వయసు వారు మూడు డోసులు వేసుకోవాలన్నారు. ఒక్కో డోసుకు మధ్య ఐదు నెలల వ్యత్యాసం ఉండాలన్నారు. 26 ఏళ్లలోపు వయసున్నవారు దీనిని తీసుకోవాలన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్కు ఇతర క్యాన్సర్లను నిరోధించే శక్తి కూడా ఉందన్నారు. కార్యక్రమంలో సీ్త్రల వైద్య నిపుణురాలు డాక్టర్ సునందరాణి, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మురళీసంతోష్, డాక్టర్ సాయి సునీల్ కిషోర్ తదితరులు మాట్లాడారు.