
ఏపీ ప్రాక్టీసింగ్ న్యాయవాదుల సంఘం కార్యనిర్వహక కార్యదర
విశాఖ–లీగల్: ఆంధ్రప్రదేశ్ ప్రాక్టీసింగ్ న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నగరానికి చెందిన పిల్లా నీలకంఠ చక్రవర్తి నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రంగారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన నియామకం పట్ల నగర న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యులు పి.నరసింగరావు, కె.రామజోగేశ్వరరావు, బైపా అరుణ్ కుమార్, ఆలిండియా లాయర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు బీ.వీ.రామాంజనేయరావు, ఇండియన్ లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.సురేష్కుమార్, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు పప్పు అనురాధ, సీనియర్ న్యాయవాది శకుంతల హర్షం ప్రకటించారు.