రేపటి నుంచి సీజీఆర్‌ఎఫ్‌ సదస్సులు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సీజీఆర్‌ఎఫ్‌ సదస్సులు

Jun 12 2025 2:58 AM | Updated on Jun 12 2025 2:58 AM

రేపటి నుంచి సీజీఆర్‌ఎఫ్‌ సదస్సులు

రేపటి నుంచి సీజీఆర్‌ఎఫ్‌ సదస్సులు

విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో విశాఖ జోన్‌–2, బొబ్బిలి, జగ్గంపేట డివిజన్ల విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహించనున్నట్లు విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌) చైర్‌పర్సన్‌, విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 13న విశాఖ సర్కిల్‌ జోన్‌–2 డివిజన్‌ (పెదగంట్యాడ సెక్షన్‌), 17న విజయనగరం సర్కిల్‌ బొబ్బిలి డివిజన్‌(మెంటాడ సెక్షన్‌), 19న కాకినాడ సర్కిల్‌ జగ్గంపేట డివిజన్‌(హంసవరం సెక్షన్‌) కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ సదస్సులు జరుగుతాయని తెలిపారు. వినియోగదారులు నేరుగా పాల్గొని విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, హెచ్చు తగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, పేరుమార్పిడి, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్‌ ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్‌ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను తెలపాలని సూచించారు. అలాగే సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఉన్న సీజీఆర్‌ఎఫ్‌ కార్యాలయానికి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారుల సమస్యల వివరాలను పరిశీలించి, విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారులు విద్యుత్‌ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912కు సంప్రదించాలని సూచించారు. ఈ సదస్సుల్లో తనతో పాటు సీజీఆర్‌ఎఫ్‌ కమిటీ సభ్యులు బి.సులేఖరాణి, ఎస్‌.సుబ్బారావు, ఎన్‌.మురళీకృష్ణ పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement