రోగులకు మెరుగైన వైద్యం నా లక్ష్యం: డాక్టర్‌ వాణి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన వైద్యం నా లక్ష్యం: డాక్టర్‌ వాణి

Jun 10 2025 6:50 AM | Updated on Jun 10 2025 6:50 AM

రోగులకు మెరుగైన వైద్యం నా లక్ష్యం: డాక్టర్‌ వాణి

రోగులకు మెరుగైన వైద్యం నా లక్ష్యం: డాక్టర్‌ వాణి

మహారాణిపేట: కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ప్రసూతి, సీ్త్ర వ్యాధుల విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఐ.వాణి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్‌ పోస్టు అదనపు డీఎంఈ కేడర్‌లో ఉండటంతో.. అదే కేడర్‌కు చెందిన డాక్టర్‌ వాణిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న డాక్టర్‌ పి.శివానంద్‌ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేటర్‌ బి.వి.రమణ, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ జి.మెహర్‌ కుమార్‌, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇతర వైద్యులు, పరిపాలన సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్‌ వాణి మాట్లాడుతూ రోగులకు మెరుగైన సంరక్షణ, ఉన్నతమైన చికిత్స ప్రమాణాలు అందించడమే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement