అధికారిక లాంఛనాలతో ‘పల్లా’ అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అధికారిక లాంఛనాలతో ‘పల్లా’ అంత్యక్రియలు

Jun 9 2025 8:04 AM | Updated on Jun 9 2025 8:04 AM

అధికారిక లాంఛనాలతో ‘పల్లా’ అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో ‘పల్లా’ అంత్యక్రియలు

గాజువాక: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం జరిగాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం నగరంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి ఆదివారం పార్థివ దేహాన్ని గాజువాక తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం గాజువాక హైస్కూల్‌ రోడ్‌లోని కై లాసభూమిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, మేయర్‌ పీలా శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, పీలా గోవింద సత్యనారాయణ, స్థానిక నాయకులు మంత్రి రాజశేఖర్‌, తిప్పల దేవన్‌రెడ్డి, టి.హర్షవర్థన్‌ ప్రసాద్‌, పప్పు రాజారావు, కోన తాతారావు, పలువురు కార్పొరేటర్లు, పలువురు వాణిజ్య, అధికార ప్రముఖులు పల్లా సింహాచలం పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌, పల్లా శంకర్రావులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement