
కేజీహెచ్సూపరింటెండెంట్గా వాణి
మహారాణిపేట: కేజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఐ. వాణి నియమితులయ్యారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖలో అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా పదోన్నతి పొందిన డాక్టర్ వాణి, ప్రస్తుతం కేజీహెచ్లో సీనియర్ ప్రొఫెసర్గా, గైనిక్ విభాగాధిపతి (హెచ్ఓడీ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టీ. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కేజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ పి. శివానంద్ 16 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు.