
ఏపీఈఏపీసెట్లో కీర్తనకు 34వ ర్యాంక్
కూర్మన్నపాలెం: వడ్లపూడికి చెందిన గురు కీర్తన ఏపీఈఏపీసెట్ ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్ర స్థాయిలో 34వ ర్యాంక్ను కై వసం చేసుకుంది. కీర్తన ఉక్కునగరంలోని డీఎస్వోపీ స్కూల్లో ప్రాథమిక విద్యను, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించింది. కీర్తన తండ్రి శ్రీనివాసరావు ఉక్కు కర్మాగారంలోని వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తుండగా, తల్లి నీలవేణి గాజువాకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కీర్తన మాట్లాడుతూ డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పింది.