తాండూరు: తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకు గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్ సభ్యులతోనే రాష్ట్రంలోనే గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మర్చంట్ అసోసియేషన్ 2026– 28 సంవత్సరానికి ఎమ్మెల్యేతో పాటు.. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి, మాజీ చైర్పర్సన్ స్వప్నపరిమళ్, వ్యాపారులు, నాయకుల సమక్షంలో బుధవారం మార్కెట్ నూతన కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు వీరేందర్తో పాటు నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు.


