
నాణ్యత శూన్యం!
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
సన్నబియ్యం..
8లోu
బషీరాబాద్: ప్రభుత్వం ఆహార భద్రత కింద పేదలకు అందజేస్తున్న సన్నబియ్యంలో నాణ్యత కొరవడింది. తెల్లపురుగులు, నూకలు, ఉల్లెడ వస్తున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లాకు నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి, మహబూబ్నగర్ ప్రాంతాల నుంచి 1,600 మెట్రిక్ టన్నులకు పైగా సన్నబియ్యం ఇప్పటికే సరపరా అయ్యాయి. అయితే నిజామాబాద్ నుంచి వచ్చే సన్నబియ్యంలో నాణ్యత లోపించిందని.. వనపర్తి బియ్యం కావాలని డీలర్లు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు.
2.64 లక్షల మంది లబ్ధిదారులు
ఉగాది పర్వదినం రోజున ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 2.64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతీ నెలా 5,604 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా అందజేస్తోంది. కాగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి ఇవ్వాలనుంచి జూన్ 1వ తేదీ నుంచి సరఫరా షురూ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 1,432 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందజేసింది.
నిజామాబాద్ నుంచి వచ్చిన బియ్యాన్ని నిరాకరిస్తున్న డీలర్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ బియ్యంలో 25 శాతం వరకు నూకలు ఉండొచ్చు. కానీ నిజమాబాద్ నుంచి వచ్చే సన్నబియ్యంలో 25 శాతం కంటే అధికంగా నూకలు ఉన్నట్లు లబ్ధిదారులు, డీలర్లు చెబుతున్నారు. లబ్ధిదారులు ఉల్లెడపట్టిన, పురుగుల బియ్యం ఎలా తినాలి అంటూ డీలర్లతో గొడవకు దిగుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యమే పంపిణీ చేస్తున్నామని.. ఏదైనా ఉంటే అధికారులకు చెప్పుకోవాలని సూచిస్తున్నారు.
న్యూస్రీల్
రేషన్ బియ్యంలో 25 శాతానికి మించి నూకలు
పురుగు, ఉల్లెడ వస్తున్నాయని లబ్ధిదారుల ఆగ్రహం
పట్టించుకోని పౌరసరఫరాల శాఖ
జిల్లాలో 1,432 మెట్రిక్ టన్నుల రైస్ సరఫరా

నాణ్యత శూన్యం!