
ఆర్థిక బాధ్యతలు మోయలేం
దోమ: నిధుల లేమి, ఆర్థిక వనరులు లేని పంచాయతీల నిర్వహణ బాధ్యతలను తాము మోయలేమని పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని 36 జీపీలకు సంబంధించిన సెక్రటరీలు.. బుధవారం పంచాయతీ కార్యాలయాలు, ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓ గ్యామాకు అందజేశారు. ఆర్థికపరమైన విధు లు చిరుద్యోగులైన తమకు తలకు మించిన భారంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీటినుంచి తప్పుకొంటున్నామని ఎంపీడీఓకు తెలిపారు.
విధులు బహిష్కరించిన పంచాయతీ కార్యదర్శులు
జీపీ కార్యాలయాలు, ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓకు అప్పగింత