
దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి
అనంతగిరి: ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లో పార్టీ ఆధ్వర్యంలో పేదరికం లేని దేశంగా అభివృద్ధి చెందాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నేడు యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో సంఘటన సంరచనా ప్రభారీ పడాకుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి, పార్టీ పట్టణ అద్యక్షురాలు యాస్కి శిరీష, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.